స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ తన చివరి దశలో.. సునిల్, పోసాని, అమ్మా రాజశేఖర్ లాంటి వారికి జోడీగా నటించే పరిస్థితి వచ్చింది. అప్పటిక ఆమెకు 30 ఏళ్ళు కూడా రాలేదు. కాని ఆమె అప్పటికే ఫెయిడ్ అవుట్ అయిపోయింది. తరుణ్ వివాదం తరువాత వెంటనే పెళ్ళి చేసుకన్న ఈ హీరోయిన్ రెండు మూడేళ్ళకే విడాకులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక మానసిక సంఘర్షణలతో పాటు.. రకరకాల సమస్యలతో ఆమె బాగా లావుగా తయారయ్యింది. హీరోయిన్ గా ఆపర్లు లేకపోవడంతో పాటు.. ఇతర సమస్యలు తోడై ఆర్తి అగర్వాల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఇక లావు తగ్గాలన్న ఆరాటంలో లైపో ట్రిట్మెంట్ చేయించుకన్న ఆమె.. అది వికటించి..కొంత కాలానికి మరణించింది. ముచ్చటగా మూడు పదులు నిండకుండానే.. ఆర్తి అగర్వాల్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.
ఇక తను పడిన ఇబ్బందులు.. బాధలు.. ఎవరు తనను ఇబ్బంది పెట్టారు అనే విషయాలు ఆర్తిఅగర్వాల్ తనతో షేర్ చేసుకునేదని అన్నారు ప్రముఖ స్టార్ కొరియో గ్రఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ అమ్మా రాజశేఖర్. గతంలో ట్రీ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు ప్రస్తావించాడు. రణం2 సినిమాలో ఆర్తి అగర్వాల్ అమ్మా రాజశేఖర్ కు జంటగా నటించింది. కాగా ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఆమె బాగా లావైపోయిందట.
అప్పుడు ఆమెకు రాజశేఖర్ ధైర్యం చెప్పారట. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వారు నన్ను మోసం చేశారు.. కాని మీరిచ్చే సపోర్ట్ మర్చిపోలేను అని అన్నారట ఆర్తి అగర్వాల్. ఆమె కోసమే సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ప్లాష్ బ్యాక్ సీన్ కోసం లావు అవ్వాలని అన్నాను .. అని ఆర్తి విషయంలో కవర్ చేశారట అమ్మా రాజశేఖర్. కాని ఆర్తి పరిస్థితి ఇలా అవుతుందని తాను అనుకోలేదన్నారు స్టార్ డైరెక్టర్. తనకు ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ఇద్దామనుకున్నానని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆర్తికి చెప్పారట అమ్మ రాజశేఖర్.