బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలలో ఢీ షోకి మంచి క్రేజ్ ఉంది. చాలా మంది డ్యాన్సర్లు ఢీ షోతో తమ ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ఢీ 20 విజయవంతంగా సాగుతోంది. ఈ షోకి హోస్ట్ గా నందు వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ రెజీనా కసాండ్ర, విజయ్ బిన్నీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. హైపర్ ఆది లాంటి వారు కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు.