'కుబేరా' రెండు రోజుల్లోనే ఆ వసూళ్లను దాటేసి, ఇప్పుడు డబుల్ వసూళ్లు రాబడుతోంది. అయితే సోమవారం కలెక్షన్ల మీదే ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. మరి ఇది ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన `కుబేర` చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ములు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రిచ్ మ్యాన్కి, బిచ్చగాడికి మధ్య పోరాటమే ఈ మూవీ.