Devatha: రుక్మిణీని దారుణంగా అవమానించిన సత్య.. నువ్వు అసలు నాకు అక్కవే కాదంటూ!

Published : Oct 10, 2022, 01:25 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
17
Devatha: రుక్మిణీని దారుణంగా అవమానించిన సత్య.. నువ్వు అసలు నాకు అక్కవే కాదంటూ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..సత్య రుక్మిణితో, ఇందాక నువ్వు ఆదిత్యని పెనిమిటి అని పిలిచావు కదా? అసలు నీకు పెళ్లయి పిల్లలు ఉన్నా సరే ఆదిత్యని పెరిమిటీ అని పిలవడం ఏంటి. నా చెవుల తో ఇదంతా వింటే నాకే అసహ్యం వేస్తుంది. నాకోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసి వెళ్లిపోయావు అని నేను నిన్ను దేవతలా అనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి నన్ను ఆదిత్య ని ఎందుకు విడగొట్టాలి అనుకుంటున్నావు. నీకు మంచి భర్త ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా ఆదిత్యతో నీకేం పని. ఆంటీ నిన్ను దేవతలా చూస్తున్నారు అందుకే కమలక్క కూతురికి కూడా నీ పేరు పెట్టారు.
 

27

ఇప్పుడు ఈ విషయం అంతా ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు రుక్మిణి, సత్య నాకు పెళ్లి..అని మాట పూర్తికాకముందే ఇంక ఆపు అక్క. ఒకప్పుడు నేను నీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపించేదాన్ని కానీ ఇప్పుడు నీ మాటలు వినాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుంది. అదే సమయంలో దేవి అక్కడికి వస్తుంది. అప్పుడు చిన్మయి రుక్మిణి తో, నువ్వు రాధవి కాదు రుక్మిణివి అని ఆంటీ కి చెప్పకుండా, ఆవిడకి కనబడకుండా నువ్వు కావాలని తిరుగుతున్నావు కదా నీ మీద అభిమానంతో నేను ఇన్ని రోజులు నిన్ను వెనకేసుకొని వచ్చాను.
 

37

 ఇప్పుడు నీ స్వభావం చూస్తేనే నాకు సిగ్గేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్య అన్న మాటలకు రుక్మిణి ఏడుస్తూ ఉంటుంది. ఈ సంభాషణ అంతా విన్న దేవి, అమ్మ పేరు రాధ కాదా రుక్మిణి యా అని ఆశ్చర్యానికి గురవుతుంది. మరోవైపు ఆదిత్య,చిన్మయి రుక్మిణి కోసం వెతుకుతూ ఉంటారు. నీకు కనిపించిందా అని ఆదిత్య అనగా లేదు అని చెప్తుంది చిన్మయి. అప్పుడు దేవి మౌనంగా పూజ దగ్గరకు వెళుతుంది.అప్పుడు పంతులుగారు పూజ అయిపోయింది దేవుడమ్మ గారు భాషకి చెప్పి అన్ని మీ కార్లో పెట్టించేసాను అని అంటారు.
 

47

అప్పుడు దేవి అక్కడికి రాగానే దేవుడమ్మ, మీ అమ్మని తీసుకొని వస్తా అన్నావు ఏది అని అడగగా, అమ్మ కనిపించడం లేదు అని చెప్తుంది. ఎందుకు మీ అమ్మ నాకే కనిపించడం లేదు అని దేవుడమ్మ అనుకుంటుంది.ఇంతలో చిన్మయి,ఆదిత్యలు అక్కడికి వస్తారు. అప్పుడు మాధవ్, రాదేవి ఇంటికి వెళ్దాము అని చిన్మయిని దేవిని తీసుకొని బయలుదేరుతారు. మరోవైపు రాధ గుడికి అవతల వైపు కూర్చొని ఏడుచుకుంటూ జరిగిన విషయాన్ని గుర్తుతెచ్చుకొని, సత్యేనా నాతో అలా మాట్లాడింది. నేను ఎందుకు సత్యకి హాని చేయాలని చూస్తాను తన కోసమే కదా నా జీవితాన్ని కూడా వద్దనుకొని ఇప్పుడు ఇలా బతుకుతున్నాను అని అంటుంది.
 

57

మరోవైపు దేవి మౌనంగా ఉండడం చూసి చిన్మయి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు అని దేవి అంటుంది. అప్పుడు మాధవ్ ఆదిత్య దగ్గరకు వెళ్లి,రాధ కోసం వెతుకుతున్నట్టు ఉన్నావు కదా మీరు నా మీద పగలు పెంచుకోవాలనుకుంటే మీకేనాష్టం ఆఫీసర్. ఇప్పుడు చూడు రాధ మీద ఇంటికి రావాలనుకున్న రాలేని పరిస్థితి.మా అమ్మకి తగ్గేంత వరకు రాద మీ ఇంటికి రాదు మా అమ్మకి తగ్గేలా అవ్వడం జరగదు. నిజానికి నాలో ఉన్న చెడ్డవాడిని బయటకు తెచ్చింది నువ్వే. నీ వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు నువ్వు దేవి దగ్గరికి వెళ్లి నువ్వే తన నాన్నవి అని చెప్పినా సరే,దేవి నమ్మని స్థితిలోకి నేను తీసుకొని వస్తాను.
 

67

దేవి రాధా ఇద్దరు నా వాల్లే అని వార్నింగ్ ఇస్తాడు.మరోవైపు ఇంట్లో రుక్మిణి జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు సత్య కూడా, అక్క ఎందుకు ఇలా చేస్తుంది అని బాధపడుతుంది. మరోవైపు ఆదిత్య, సత్య ఎందుకు రుక్మిణిని తప్పుగా చూస్తుంది సత్య కోసం రుక్మిణి చేసిన త్యాగం మర్చిపోయిందా? ఎందుకు ఇలా తప్పు మార్గంలో నడుస్తుంది అని బాధపడతాడు. మరోవైపు రాధ గురించి నిజం తెలుసుకున్న దేవి కూడా అదే స్థితిలో ఉంటుంది. అప్పుడు చిన్మయి దేవి దగ్గరికి వచ్చి, ఏం దేవి అలాగున్నావు ఇందాకటి నుంచి మౌనంగా ఉన్నావు.
 

77

 ఏం మాట్లాడడం లేదు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అదే సమయంలో రుక్మిణి వంట చేసి భోజనానికి పిలుస్తుంది.రా దేవి వెళ్లి భోజనం చేద్దామని అనగా నాకు ఆకలిగా లేదు అని దేవి అంటుంది. ఏమైంది అని రుక్మిణి దేవిని అడగగా దేవి నాకు ఆకలేయడం లేదు మీరే తినండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో,దేవుడమ్మ భుజం నొప్పిగా ఉందని పట్టుకుంటూ ఉంటుంది.అప్పుడు దేవుడమ్మ భర్త, ఈ వయసులో నీకెందుకు ఆ మొక్కలన్ని మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి పేరు, పలుకుబడి ఉన్నది ఇంకేం అవసరం అని అడుగుతాడు.దానికి దేవుడమ్మ, ఎన్నున్నా సరే మనవాళ్ళు లేని లోటు తీర్చావు కదా. ముసలైన తర్వాత మనకి ఆనందాన్ని ఇచ్చేవి అవే కదా అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల మాటలు సత్య వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories