ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

First Published Apr 16, 2024, 6:12 PM IST

చాలా కాలంగా విడిపోయి.. విడివిడిగా బ్రతుకుతున్న సెలబ్రిటీ మాజీ జంట ధనుష్, ఐశ్వర్య విడాకులపై కోర్ట్ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. 

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు హీరో  ధనుష్. ఆయన స్టార్ హీరోగా మాత్రమే కాకుండా.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ఫేమస్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అప్పట్లోనే  చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు మహామహులు హాజరయ్యారు. 

దాదాపు 18 ఏళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసిన వీరికి  యాత్ర, లింగ అనే ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. వారు పెద్దవారయ్యారు కూడా. రీసెంట్ గా రెండేళ్ళ క్రితం వీరు విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ధనుష్ కు హీరోయిన్లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దాంతో ఐశ్వర్యనే ధనుష్ తో విడిపోవాలి అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

అంబానీ కోడలు రాధిక మర్చంట్ నైట్ పార్టీలో జాన్వీ కపూర్, పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించిన బ్యూటీ..

అంతే కాదు ధనుష్ తన తల్లిదండ్రులకు 150 కోట్లతో ఇల్లు కట్టించడం ఐశ్వర్యకు ఇష్టం లేకపోవడమే ఈ మనస్పర్ధలకు కారణం అంటూ మరో మాట కూడా వినిపించింది తమిళనాట. గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఇద్దరూ కోర్టుకు వెళ్లకపోవడంతో మళ్లీ కలిసి జీవించే అవకాశం ఉందని అందరూ భావించారు. ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

అయితే వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు, పెద్దలు.. చాలామంది ప్రయత్నించారు. కాని వారు వినలేదు. అయితే ఇంత కాలం వారి మాటమీద విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఉంటూ వస్తున్నారు. వారి పిల్లలు మాత్రం కొన్ని రోజులు తండ్రి దగ్గర.. కొన్నిరోజులు తల్లి దగ్గర ఉంటూ వచ్చారు. 
 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

aishwarya rajinikanth

అయితే రెండు వారాల క్రితం ఐశ్వర్య ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల కేసు వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిద్దరినీ అక్టోబర్ 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో వీరి విడాకులు పక్కా అని తెలుస్తోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ డిస్సపాయింట్ లో ఉన్నారు. ఈ జంట మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు. 
 

పెళ్ళి తరువాత  ఎంతో సంతోషంగా జీవించారు ఐశ్వర్య-ధనుష్ దంపతులు. భర్త ధనుష్ ఎదుగుదలకు సహకరించిన ఐశ్వర్య.. ధనుష్ తో '3' సినిమాను తెరకెక్కించింది. ఈసినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. పెళ్లై పిల్లలు పుట్టి.. 18 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వీరు.. విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. 
 

click me!