రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ - నీతా అంబానీల రెండవ కుమారుడు ఆనంద్ అంబానీ, తన స్నేహితురాలు రాధిక మర్చంట్ ను జూలై 12న వివాహం చేసుకోబోతున్నారు. ఈ పెళ్ళికి సబంధిచిన ఉత్సవాలు మూడు నెలల ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి.
రాధిక మర్చంట్ ఇచ్చిన గ్రాండ్ నైట్ పార్టీకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాజరయ్యారు. జాన్వీ కపూర్ మరియు రాధిక స్నేహితులు పింక్ నైట్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. డ్రెస్ కోడ్ కాస్త విచిత్రంగా ఉండటంతో పాటు.. పార్టీలో రచ్చ రచ్చ చేశారు.
రాధిక వైట్ వాటర్ నైట్ డ్రెస్లో తలపై కిరీటం ధరించి కనిపించింది. ఇక ఈ నైట్ పార్టీలో అంబాని పెద్ద కొడలుతో పాటు... అంబాని యూత్ అంతా పాల్గొని సందడి చేశారు. అటు అనంత్ అంబాని.. అతని ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
ఇక వీరి పెళ్లి వేడుకల్లో భాగంగా గత ఫిబ్రవరిలో, ముఖేష్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్ లో గ్రాండ్ ప్రిక్స్ వెడ్డింగ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలకు రామ్ చరణ్ తో పాటుగా.. సూపర్ స్టార్ రజనీకాంత్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
హాలీవుడ్ నటి, పాప్ సింగర్ రిహన్నా ఈ కార్యక్రమానికి హాజరై అద్భుతంగా కనిపించారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయడంతో, పెళ్లి ఇంతకంటే గ్రాండ్గా జరగాలని భావిస్తున్నారు.