Colors Swathi: సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఇంతకీ ఎవరతను

Published : Jul 08, 2026, 09:50 PM IST

Colors Swathi: అచ్చ తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి జీవితంలో రెండో ప్రయాణం మొదలు పెట్టింది. యంగ్ డైరెక్టర్ ను ప్రేమించి సీక్రేట్ గా రెండోపెళ్లి చేసుకుంది టాలీవుడ్ స్టార్ కలర్స్ స్వాతి అలియాస్ స్వాతిరెడ్డి. ఇంతకీ ఆమె పెళ్లాడిన యంగ్ డైరెక్టర్ ఎవరు.?

PREV
14
రెండో సారి పెళ్లి పీటలెక్కిన కలర్స్ స్వాతి..

తెలుగు టెలివిజన్ రంగంలో ‘కలర్స్’ అనే ఒకే ఒక్క షోతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి. ఆ తర్వాత వెండితెరపై కూడా ‘అష్టా చమ్మా’, ‘స్వామి రారా’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 

తాజాగా స్వాతి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆమె ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతి రెడ్డి దర్శకుడు, ‘మంథ్ ఆఫ్ మధు’ ఫేం శ్రీకాంత్‌ నగోటిను పెళ్లి చేసుకుంది.

24
దర్శకుడితో రెండో ప్రయాణం

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రమంలోనే, యువ దర్శకుడు శ్రీకాంత్‌ నగోటితో స్వాతికి పరిచయం ఏర్పడింది. కథా చర్చలు, సినిమా ప్రయాణంలో వీరిద్దరి ఆలోచనలు, మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం చాలా నిశ్శబ్దంగా, ప్రైవేట్‌గా జరిగినట్లు సమాచారం. సంప్రదాయ పద్దతిలో పెళ్లి జరుగగా.. స్వాతి రెడ్డి తన భర్త చేయి పట్టుకున్న ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

34
మొదటి వివాహం.. విడాకులు

స్వాతి 2018లో మలయాళీ అయిన వికాస్ వాసు అనే అంతర్జాతీయ పైలట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమై ఇండోనేషియాలో స్థిరపడ్డింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా ఖాతాల నుండి భర్త ఫోటోలను తొలగించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాల నుండి కోలుకోవడానికి స్వాతి కొంత సమయం తీసుకున్నారు.

44
సినిమాల్లోకి రీ-ఎంట్రీ

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, స్వాతి ధైర్యంగా ముందడుగు వేశారు. మళ్లీ తన నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని 'పంచతంత్రం', 'మంత్ ఆఫ్ మధు' వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈసిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డ స్వాతీ.. తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు స్వాతికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories