చిరంజీవి-ఓదెల మూవీ నుంచి క్రేజీ అప్‌ డేట్‌, మెగా ఫ్యాన్స్ కి ఆ విషయంలో డిజప్పాయింట్‌ తప్పదా?

Published : Dec 18, 2024, 08:15 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నెక్ట్స్ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌ డేట్ వినిపిస్తుంది.   

PREV
15
చిరంజీవి-ఓదెల మూవీ నుంచి క్రేజీ అప్‌ డేట్‌, మెగా ఫ్యాన్స్ కి ఆ విషయంలో డిజప్పాయింట్‌ తప్పదా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఇది రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది మేలో ఈ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు ఇటీవలే కొత్త సినిమాని ప్రకటించారు చిరంజీవి. `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. 

read more: అజ్ఞానంతో చేస్తున్నారు.. అల్లు అర్జున్‌పై వివాదాస్పద కామెంట్లకు రాజేంద్రప్రసాద్‌ వివరణ ఇదే
 

25

చిరంజీవి-ఓదెల పేరుతో విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్‌ అదిరిపోయింది. ఇందులో చేతి నుంచి రక్తం కారుతుండగా పోస్టర్‌ మాత్రం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఈ మూవీకి హీరో నాని నిర్మాతగా వ్వవహరించడం విశేషం.

నాని సమర్పణలో సినిమా రూపొందబోతుంది. అయితే ఈ కథ మొదట నానికి చెప్పారట. తనకంటే చిరంజీవి చేస్తే బాగుంటుందని, కథలో మార్పులు చేసి ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. 

35

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇది పూర్తి యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందట. అదే సమయంలో చిరంజీవి తన ఏజ్‌కి తగ్గ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలివేషన్లు, యాక్షన్‌ సీన్లకు కొదవలేదని తెలుస్తుంది.

అయితే ఇక్కడే మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే మరో వార్త వినిపిస్తుంది. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌ లేదట. డాన్సులు కూడా ఉండవని తెలుస్తుంది. రొమాన్స్ కి స్కోప్‌ లేదని, చిరంజీవి సోలోగా విశ్వరూపం చూపించబోతున్నారట. 

also read: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ.. బాలయ్య వారసుడి ఎంట్రీలో మరో ట్విస్ట్ ? తెరపైకి మరో దర్శకుడి పేరు

45

డ్రై యాక్షన్‌ మూవీగా దీన్ని రూపొందించబోతున్నారు. కొంత రా ఛాయలు కనిపిస్తాయట. మెగాస్టార్‌ని ఓ కొత్త లుక్‌లో చూడబోతున్నారని, ఆయనకు ఇదొక కొత్త తరహా సినిమా అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.. నానితో `పారడైజ్‌` అనే మూవీని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమా ఉండబోతుందట. ఈ లోపు చిరంజీవి `విశ్వంభర` నుంచి ఫ్రీ అవుతారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. వీఎఫ్‌ఎక్స్ భారీగా ఉంటాయని, అందుకోసమే లేట్‌ అవుతుందని సమాచారం. 
 

55

ఇక శ్రీకాంత్‌ త్వరగా ఫ్రీ అయితే నెక్ట్స్ ఆయన సినిమానే పట్టాలెక్కబోతుంది. లేదంటే ఈ లోపు అనిల్‌ రావిపూడితో సినిమా చేసే ఆలోచనలోనూ చిరంజీవి ఉన్నారట. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి.. వెంకటేష్‌ హీరోగా `సంక్రాంతికి వస్తున్నాం` అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని రూపొందించారు.

ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆ తర్వాత చిరంజీవితో సినిమాపై వర్క్ చేయనున్నారట. అన్నీ కుదిరితే శ్రీకాంత్‌ ఓదెల మూవీ కంటే ముందే చిరంజీవి అనిల్‌ రావిపూడి మూవీ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

read more: ఆ పని చేయలేక కాలు విరగొట్టుకున్న జూ ఎన్టీఆర్‌, ఇప్పటికీ అదే మొండిపట్టు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories