వెంటనే ఎన్టీఆర్ కి నాగార్జున నుండి కాల్ వచ్చిందట. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నీ కంటే పెద్దవాళ్ళ గురించి అంతేనా మాట్లాడేది అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఆ వయసులో ఎన్టీఆర్ కి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. అయితే తర్వాత ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు. తెలియని ప్రాయంలో చేసిన అనాలోచిత కామెంట్స్ అని ఆయన ఒప్పుకున్నారు.
సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాలా డిజాస్టర్ అయ్యింది. సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ... ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. రంగంలోకి దిగిన రాజమౌళి యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చాడు.