ఇక ఈ సినిమాలో చిరంజీవి రాజు అనే టూరిస్ట్ గైడ్ పాత్రలో కనిపించాగా.. శ్రీదేవి దేవకన్యగా నటించింది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చిన అతిలోక సందరి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఈసినిమాలో శ్రీదేవి చేసిన ఇంద్రజ పాత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
ఈ సినిమా నుంచే ఆమెకు అతిలోకసుందరి అనే బిరుదు కూడా వచ్చింది. ఈమూవీలో వీరితో పాటుగా అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. భారీ బడ్జెట్తో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు.