Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..

Published : May 14, 2026, 03:33 PM IST

జబర్దస్త్ కామెడీపై ఇండైరెక్ట్ గా పంచులు వేసింది హీరోయిన్ బిందు మాధవి. కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె.. వల్గర్ జోకులపై తన మార్క్ కామెంట్స్ చేసింది. ఇంతకీ బిందు ఏమన్నదంటే?

PREV
15
తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన షో..

తెలుగు బుల్లితెరపై సంచలన కామెడీ జబర్దస్త్. ఈ షోకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మారుమూలన ఉన్న టాలెంట్ ను వెలుగులోకి తెచ్చింది జబర్దస్త్. టాలీవుడ్ లో కమెడియన్స్ కు తగ్గుతున్న టైమ్ లో.. జబర్దస్త్ కమెడియన్స్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఎంతో మంది కమెడియన్స్ ను పరిశ్రమకు అందించింది జబర్దస్త్. తెలుగు రాష్ట్రాలలో లక్షలమంది మనసు దోచుకుంది ఈ కామెడీ షో. ఎంత పాపులారిటీ సాధించిందో.. అన్ని విమర్శలు కూడా జబర్దస్త్ పై వచ్చాయి.

25
డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రెస్...

ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించిన జబర్దస్త్ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీతో కూడిన జోక్స్ ఎక్కువగా ఉంటాయని, ఫ్యామిలీతో కలిసి కలిసి కొన్ని స్కిట్స్ చూడలేమని చాలా మంది అభిప్రాయం .ఈక్రమంలో హీరోయిన్ బిందు మాధవి చేసిన తాజా కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి.

35
మాస్ జాతర షోకి జడ్జిగా..

ప్రస్తుతం ప్రస్తుతం బిదు మాధవి మాస్ జాతర అనే కొత్త కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కూడా కామెడీ స్కిట్స్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈ షో గురించి రీసెంట్ గా బిందు మాధవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "మొదట నన్ను ఈ షోకు జడ్జిగా రావాలని అడిగినప్పుడు నేను కొంత వెనకడుగు వేశాను. కామెడీ స్కిట్స్ అంటే సాధారణంగా వల్గర్ లైన్స్, వల్గర్ జోక్స్ ఎక్కువగా ఉంటాయని భావించాను. ఇప్పటికే అలాంటి షోలు చూస్తున్నాము.'' అని అన్నారు. ఆమె ఈ కామెంట్స్ జబర్దస్త్ ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు తెలుస్తోంది.

45
డైరెక్టర్ హామీ ఇవ్వడంతో..

బిందు మాధవి మాట్లాడుతూ.. '' వల్గర్ జోక్స్ కారణంగానే మొదట ఈ ఆఫర్‌ను నేను అంగీకరించలేదు. అయితే షో డైరెక్టర్ మళ్లీ వచ్చి ఈ కార్యక్రమంలో ఎలాంటి వల్గారిటీ ఉండదని హామీ ఇచ్చారు. అంతేకాదు.. అలాంటి కంటెంట్ ఉంటే షో మధ్యలోనే వెళ్లిపోవచ్చని కూడా చెప్పారు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పడంతో నేను ఈ షోలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికే 28 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు''. అని బిందు మాధవి తెలిపింది.

55
జబర్దస్త్ కు కౌంటర్ ఇచ్చిందా?

తెలుగులో మొదటిసారి వల్గార్ జోకులు లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఒక కామెడీ షో చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని బిందు మాధవి అన్నారు. అయితే ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె కామెడీ స్కిట్స్‌లో వల్గారిటీ గురించి ప్రస్తావించడం, ఇండైరెక్ట్ గా జబర్దస్త్ షో కు కౌంటర్ ఇచ్చినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories