ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్..
ఈ వారం నామినేషన్స్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రమ్య మోక్ష , రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, దివ్య నిఖిత, తనూజ , రాము రాథోడ్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. కెప్టెన్లుగా ఉన్న సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలు మాత్రం నామినేషన్లకు మినహాయింపు పొందారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం తనూజ అత్యధిక ఓట్లతో ముందంజలో ఉంది. ఆమె 37.46 శాతం ఓటింగ్ సాధించింది. ఆ తరువాతి స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల 20.42 శాతం, దివ్య నిఖిత 9.81 శాతం, రాము రాథోడ్ 8.86 శాతం, సంజన గల్రానీ 8.81 శాతం, రీతూ చౌదరి 6.49 శాతం, సాయి శ్రీనివాస్ 4.83 శాతం, రమ్య మోక్ష 3.31 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే రమ్య మోక్ష ఈవారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.