Republic Day Movies: దేశం కోసం ప్రాణాలిచ్చే స్ఫూర్తినిచ్చే తప్పక చూడాల్సిన 8 దేశభక్తి సినిమాలు

Published : Jan 26, 2026, 10:19 AM IST

Republic Day 2026: జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా, దేశభక్తి ఆధారంగా, దేశం కోసం ప్రాణత్యాగం చేసేలా స్ఫూర్తిని నింపి బాక్సాఫీసుని షేక్‌ చేసిన చిత్రాలేంటో చూద్దాం.    

PREV
18
సన్నీ డియోల్‌ `బార్డర్‌`

1997లో వచ్చిన సన్నీ డియోల్ సినిమా 'బార్డర్' 1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సన్నీ సైనికుడి పాత్ర పోషించారు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.65 కోట్లు వసూలు చేసింది. ఇది దేశభక్తి చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు `బార్డర్‌ 2` రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సన్నీ డియోల్‌తోపాటు వరుణ్‌ ధావన్‌ మరో ముఖ్య పాత్ర పోషించారు. ఇది బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. ఇది రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కావడం విశేషం. 

28
విక్కీ కౌశల్‌ `ఉరి ది సర్జికల్‌ స్ట్రైక్‌`

విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన సినిమా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' 2016 ఉరి దాడి ఆధారంగా తీశారు. 2019లో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూ.360 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి చిత్రంగా విశేషంగా ఆకట్టుకుంది. ఎంతో మందిని ప్రభావితం చేసింది. చాలా మందిని ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అయ్యే దిశగా అడుగులు వేసేలా చేసింది. హీరో విక్కీ కెరీర్‌నే మలుపుతిప్పింది. 

38
సిద్ధార్థ్‌ మల్హోత్రా `షేర్జా`

సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా 'షేర్షా' 2021లో విడుదలైంది. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఇందులో సిద్ధార్థ్.. పరమవీర చక్ర విక్రమ్ బాత్రా పాత్ర పోషించారు. ఈ సినిమా కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదలైంది. విశేష ఆదరణ పొందింది.  తప్పక చూడాల్సిన చిత్రంగా నిలిచింది. 

48
అక్షయ్‌ కుమార్‌ `కేసరి`

అక్షయ్ కుమార్ హీరోగా 'కేసరి' అనే సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమా సారాగఢీ యుద్ధం ఆధారంగా తీశారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.207 కోట్లు రాబట్టింది.  దీనికి సీక్వెల్‌గా `కేసరి 2` గతేడాది వచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. 

58
అమీర్‌ ఖాన్‌ `మంగళ్ పాండే`

అమీర్‌ ఖాన్ హీరోగా నటించిన 'మంగళ్ పాండే: ది రైజింగ్' మూవీ 2005లో వచ్చింది. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. రూ.34 కోట్లతో తీసి రూ.52 కోట్లు వసూలు చేసింది.అప్పట్లో భారతీయ యువతని బాగా ప్రభావితం చేసిన చిత్రమిది. దేశ భక్తి చిత్రాలకు సంబంధించి ఇప్పటికీ బెస్ట్ ఫిల్మ్ లో ఒకటిగా నిలుస్తుంది. 

68
హృతిక్‌ రోషన్‌ `లక్ష్య`

2004లో  హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'లక్ష్య' సినిమాని కార్గిల్ యుద్ధం ఆధారంగా తీశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా, బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా బెస్ట్ పేట్రియాటిక్‌ ఫిల్మ్ గా నిలుస్తుంది.

78
విక్కీ కౌశల్

విక్కీ కౌశల్ హీరోగా 'సామ్ బహదూర్' అనే మూవీ రూపొందింది. ఇది 2023లో విడుదలైంది.  భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా బయోపిక్ గా ఈ చిత్రం రూపొందడం విశేషం. దీని బడ్జెట్ రూ.55 కోట్లు,  రూ.93 కోట్లు వసూలు చేసింది. 

88
రానా దగ్గుబాటి `ఘాజి`

రానా దగ్గుబాటి హీరోగా 'ది ఘాజీ ఎటాక్' అనే చిత్రాన్ని ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తీశారు. ఈ సినిమా 2017లో విడుదలైంది. దీని బడ్జెట్ రూ.15 కోట్లు, బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూలు చేసింది. డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. మంచి ప్రశంసలందుకుంది. ఇది హిందీతోపాటు తెలుగులో కూడా రూపొందింది. బెస్ట్ పేట్రియాటిక్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వీటితోపాటు తెలుగులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, అడవిశేషు హీరోగా `మేజర్‌`, చిరంజీవి హీరోగా `సైరా నరసింహారెడ్డి`, శ్రీకాంత్‌ హీరోగా `ఖడ్గం`, కృష్ణ హీరోగా `అల్లూరి సీతారామరాజు`, ఎన్టీఆర్‌, మోహన్‌ బాబు `మేజర్‌ చంద్రకాంత్‌`, ఎన్టీఆర్‌ `నాదేశం`, `బొబ్బిలి పులి`, విజయశాంతి `నేటి భారతం`, కమల్‌ హాసన్‌ `భారతీయుడు`, వెంకటేష్‌ `సుభాష్‌ చంద్రబోస్‌` వంటి చిత్రాలు దేశ భక్తి ప్రధానంగా రూపొందాయి. మంచి ఆదరణ పొందాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories