ఏప్రిల్ 17న షూటింగ్ కోసం బాలకృష్ణ రెడీ అయ్యాడు. సెట్ అంతా రెడీ చేశాడు. ఆ రోజు సౌందర్య షూటింగ్కి రావాల్సి ఉంది. ఆమెకోసమే బాలయ్యతో సహా టీమ్ అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ అంతలోనే గుండె పగిలే వార్త బయటకు వచ్చింది. సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిందనే వార్త విని అంతా షాక్ అయ్యారు.
యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినీ లవర్స్, సాధారణ జనం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సౌందర్య మరణించిందనే వార్తతో షాక్లోకి వెళ్లారు. అది `నర్తనశాల` టీమ్కి సైతం పెద్ద షాకిచ్చే వార్త. సౌందర్య మరణంతో ఆ మూవీనే ఆపేశారు.