పద్మ భూషన్ రావడంపై స్పందించారు నటసింహం బాలయ్యబాబు. ఈసందర్భంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన ఈ విధంగా స్పందిచారు. నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Also Read: సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?