సెప్టెంబర్ 7న 15 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడోవారం రన్ అవుతుంది. ఇప్పటి వరకు హౌజ్ నుంచి శ్రష్టి వర్మ, ప్రియా, మర్యాద మనీష్, హరీష్, ఫ్లోరా, భరణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో మధ్యలో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాస సాయి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మాధురి, రమ్య, ఆయేషా కంటెంట్ ఇస్తున్నారు. ఎంటర్టైన్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు మరీ డల్ గా ఉండటం గమనార్హం.