అలా మాద్రాస్ లో అక్కినేనికి జరిగిన అవమానం కారణంగానే ఆయన హైదరాబాద్ రావడం, ఇక్కడ స్టూడియోను నిర్మించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు అవుతోంది. 1975 లో నిర్మాణం స్టార్ట్ చేసి 1976 లో స్టూడియోను ఓపెనింగ్ చేశారు. ఇలా అక్కినేను మద్రాస్ నుంచిహైదరాబాద్ కు షిఫ్ట్ అయిన మొదటి నటుడు అయ్యారు.
అంతే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి అక్కినేని ప్రధాన కారకుడు అయ్యారు. ఆయనతరువాత చిన్నగా కొంత మంది నిర్మాతలు ఇక్కడికి చేరారు. వెంటనే ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాని శోభన్ బాబు, అంజలీదేవి, ఎస్పీ బాలు, డబ్బింగ్ జానకీ లాంటి కొంత మంది స్టార్స్ మాత్రం ఇప్పటికీ చెన్నైలోనే ఉన్నారు. అక్కడే ఫ్యామిలీస్ తో పాటు స్థిరపడ్డారు.