Intinti gruhalakshmi: అభికి క్లాస్ పీకిన అంకిత.. నందులో కొత్త మార్పులు?

First Published Sep 2, 2022, 9:44 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నందు లాస్యతో,అక్కడ అంత జరిగిన అందరూ తప్పు నాదే అని అంటున్నారు.అసలు నేనేం చేశాను అని లాస్య తో అనగా లాస్య  మనసులో, గొడవ అంతటికి కారణం నేనే అని తెలిస్తే ఇప్పుడు నందు యుద్ధం ప్రకటిస్తాడేమో అయిన ఇది అంతవరకు వస్తుందని నేను కూడా అనుకోలేదు అని  అనుకోని బాధపడొద్దులే అని అంటుంది. అప్పుడు నందు, నేను ఇప్పటి నుంచి ఆ ఇంటికి వెళ్ళను ఆ గడప కూడా తొక్కను అయినా మా ఇద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత నేను అక్కడ ఏం చేస్తాను అని  అంటాడు. దానికి లాస్య అక్కడికి వెళ్లకుండా నీ ప్రవర్తనలో మార్పు వస్తే తప్పంతా నువ్వే చేసావని, మాజీ భర్తగా నిందంతా నీ మీదే మోపుతారు.
 

కనుక ఇలాంటి సమయంలో నువ్వు వెనకడుగు వేయకూడదు. మనిద్దరం కలిసి తులసికి దెబ్బ కొడదాము ముందు సామ్రాట్ కంపెనీలకు మళ్ళీ ఎన్ని జాయిన్ అవుదాము అని అనగా నందు ఆశ్చర్యంతో లాస్య వైపు చూస్తాడు. అప్పుడు లాస్య, తప్పదు నందు మనిద్దరం ఉంటేనే వాళ్లిద్దరు మధ్య దూరం ఏర్పడుతుంది.లేకపోతే వాళ్ళు ఇంక మితిమీరిపోతారు. వాళ్ళ దొంగనాటకాలను బయటపెట్టి మీ ఫ్యామిలీ ముందు వాళ్ళని దోషులుగా పెట్టొచ్చు. అప్పుడు లాస్య నందు ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీన్లో పరంధామయ్య,అనసూయ కూర్చుని ఉంటారు. అప్పుడు అనసూయ అసలు తర్వాతే ఏం జరుగుతుంది, ఇంక తులసి కెరీర్ అయిపోయినట్టేనా?
 

తులసి ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ వద్దనుకుంటే ఎలాగా. ఒక్కడి వల్ల అక్కడంతా పెద్ద పెంట అయిపోయింది అని అంటూ ఉండగా తులసి అక్కడికి వస్తుంది.ఏం చేద్దాం అనుకుంటున్నాను తులసి అని అనసూయ తులసిని అడుగుతుంది. అప్పుడు తులసి,తెలీదు అత్తయ్య,నేను సామ్రాట్ గారి నుండి ఇప్పుడు దోషి లాగా నిలబడిపోయాను, ఆయన నన్ను చూసిన చూపు చాలా అవమానంగా ఉంది అని అంటుంది. ఆ మాటలకు అనసూయ, నువ్వేం తప్పు చేయలేదు నిన్ను చెప్పొద్దని నందు చెప్పాడు కదా ఆ విషయం వెళ్లి సామ్రాట్ కి చెప్పు అని అంటుంది. అప్పుడు తులసి నేను చెప్తే బాగోదు, దోషి మాట కు విలువ ఉండదు.అది ఆయనే వెళ్లి సామ్రాట్ గారికి నిజం చెప్పాలి. అప్పటివరకు నాకు మ్యూజిక్ స్కూల్ అవ్వదేమో అని అంటుంది.
 

ఇంతలో అభి అక్కడికి వస్తాడు నీ స్వార్థం గురించి బాగా చూసుకుంటున్నావమ్మా ఎప్పుడు నీ మ్యూజిక్ స్కూల్ తప్ప ఇంకేమీ ఉండదా అని అంటాడు. అంతలో అంకిత అక్కడికి వస్తుంది. వచ్చి చప్పట్లు కొట్టి నేను రెండు రోజులు లేకపోతే నువ్వు ఇంత పెంట పెట్టావా? అసలు స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా తులసి ఆంటీ చిన్నప్పటినుంచి ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే తప్ప తన గురించి ఎప్పుడూ ఆలోచించుకున్నది లేదు.ఇప్పుడుకైనా ఎదుగుతుంటే మీ లాంటోళ్లు తొక్కేస్తున్నారు అని అంటుంది. అప్పుడు పరంధామయ్య కూడా నీ స్వార్థం గురించి ఆలోచించుకుంటూ నువ్వు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి పోలేదా అని అంటాడు.
 

అప్పుడు అభి ఆయన ఇదంతా మంచికే జరిగింది. మ్యూజిక్ స్కూల్ ఇప్పుడే ఆగిపోయింది.లేకపోతే సామ్రాట్ని అమ్మని పక్కన చూస్తూ ఉండాల్సింది అని అడగా ఆ మాటతో అందరూ కోపంతో అభి నీ అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంకిత కూడా ఛీ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో నందు లాస్య ఆనందంగా మాట్లాడుకుంటున్నప్పుడు అనసూయ నందు కి ఫోన్ చేసి నాకు చిన్న సహాయం చేయాలి అని అంటుంది. అప్పుడు నందు ఏమిటి అని అడగగా నువ్వు చేసిన తప్పులు నువ్వే సర్దుకోవాలి. సామ్రాట్ దగ్గరికి వెళ్లి నువ్వే నిజం చెప్పొద్దు అని తులసి కి  చెప్పావు అని చెప్పాలి అని అనగా నందు నవ్వి నేనెందుకు చెప్తాను ఆ విషయం ద్వారా నేను నష్టపోతాను. అది నాకు అనవసరం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
 

ఆ తర్వాత సీన్లో అంకిత అభి దగ్గరికి వెళ్లి తిడుతూ అసలు ఆంటీ నీ నిలదీయడానికి నీకు ఏ హక్కు ఉన్నదని ఇలా అంటున్నావు. ఆంటీ మనల్ని పోషిస్తున్నారు నీకు ఏమైనా నచ్చకపోతే నీ అభిప్రాయం చెప్పాలి తప్ప వాళ్ళని బలవంతం పెట్టకూడదు.అసలు నీకు ఏ హక్కు ఉన్నదని చెప్పి ఇంత చేసావు. అభి అసలు ఇది నువ్వేనా ఇప్పుడు తల్లిని ఇలా చూస్తున్నావంటే పెద్దయ్యక నామీద అభిప్రాయభేదాలు వస్తాయి.  నాకు భయం వేస్తుంది ఒక తల్లిన సరిగ్గా చూసుకొని నువ్వు భార్యను ఎలా చూసుకుంటావు అని అంటుంది అంకిత.ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసి ఇద్దరూ వాళ్ల వాళ్ల ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!