లేచి పోవడం అనే ఓ సామాజిక దురాచారాన్ని ప్రధాన అంశంగా తీసుకొని, కామెడీతో కూడిన సస్పెన్సు క్రైమ్ డ్రామాగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు దామోదర్. ఆ విషయంలో ఆయన ఒకింత సక్సెస్ అయ్యాడు. మొదటి సగం మొత్తం భార్య లేచిపోయిన విషయాన్ని తెలియకుండా దాచడం కోసం... ఆనంద్ దేవరకొండ పడే కష్టాలు, ఇబ్బందులను సొసైటీ కోణంలో కామిక్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అసలు మీనాక్షికి ఏమైంది? ఆమెను లేపుకుపోయింది ఎవరు ? అనే సస్పెన్సు ప్రేక్షకుల్లో కొనసాగింది. దీనితో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది.