Bigg Boss Telugu 5: కుక్కల్లాగా పనిచేశాం, అనీ మాస్టర్ సీరియస్..బిగ్ బాస్ హౌస్ లో ధర్నా

First Published Nov 11, 2021, 11:39 PM IST

Bigg Boss Telugu 5లో భాగంగా 68వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. బిగ్ బాస్ హౌటల్ టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. సరదాగా మొదలైన నేటి ఎపిసోడ్ ఆ తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంది.

Bigg Boss Telugu 5లో భాగంగా 68వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. బిగ్ బాస్ హౌటల్ టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. సరదాగా మొదలైన నేటి ఎపిసోడ్ ఆ తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంది. అనీ మాస్టర్ హోటల్ మేనేజర్ గా నటించింది. ఇక రవి, శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ సర్వీస్ బాయ్స్ గా నటించారు. మిగిలిన ఇంటి సభ్యులు కస్టమర్స్ గా నటించారు.  లేడి గెటప్ లో రవి కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ కనిపించాడు. ఇక మానస్, ప్రియాంక హనీమూన్ కి వచ్చిన కపుల్స్ గా కనిపించారు. కస్టమర్స్ గా ఉన్న సభ్యులు.. హోటల్ సభ్యులని ఆటపట్టిస్తూ, వారిచేత సేవలు చేయించుకుంటూ వినోదం అందించారు. 

ఇక సిరి..Shanmukh ని టార్గెట్ చేస్తూ అతడికి పనులు చెప్పింది. వెళ్లి చికెన్ఫ్రైడ్ రైస్ కానీ, బగారా రైస్ కానీ తీసుకురావాలని ఆర్డర్ వేస్తుంది. దీనితో షణ్ముఖ్ సిరిని 300 రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఇలా Bigg Boss Hotel టాస్క్ సరదాగా సాగుతూ ఉంటుంది. హోటల్ సభ్యులు కస్టమర్లకు సేవలు చేసి వీలైనంత ఎక్కువ డబ్బు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ కస్టమర్లు మాత్రం హోటల్ సర్వీస్ కు తక్కువ డబ్బు ఇస్తూ ఇబ్బంది పెడుతుంటారు. 

మానస్, ప్రియాంక కపుల్స్ కోసం హోటల్ సభ్యులు క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. ఆ ప్లేస్ లో సన్నీ వెళ్లి కూర్చోవడం, మొరటగా ప్రవర్తించడం సరదాగా వినోదాత్మకంగా ఉంటాయి. క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లేస్ నుంచి సన్నీని పైకి లేపడానికి హోటల్ సభ్యులు చాలా ఇబ్బంది పడుతారు. రవి వచ్చి ఏకంగా సన్నీ కూర్చున్న కుర్చీని పక్కకు లాగేస్తాడు. దీనితో సన్నీ అక్కడ అల్లరి చేస్తూ మానస్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఉన్న పింకీపై నీళ్లు పోస్తాడు. దీనితో పింకీ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. 

ఇక సిరి..షణ్ముఖ్ తో హెడ్ మసాజ్ చేయించుకుంటూ కనిపిస్తుంది. ఈ టాస్క్ అయిపోయాక మీ అందరికి ఉంటుంది..అంటూ ఫ్రస్ట్రేషన్ లో షణ్ముఖ్ వార్నింగ్ ఇవ్వడం.. టాస్క్ తర్వాత కూడా మీరు ఏమీ పీకలేరు అని సిరి కౌంటర్ ఇవ్వడం సరదాగా ఉంటుంది. ఇంతలో అనీ మాస్టర్ 500 ఎవరో దొంగిలించారని ఇంటి సభ్యుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది.సీక్రెట్ టాస్క్ లో భాగంగానే తన 500 దొంగిలించారని అనుమానం వ్యక్తం చేస్తుంది. 

హోటల్ స్టాఫ్ గా తాము ఎంత సేవ చేసినప్పటికీ కస్టమర్లు సరైన విధంగా డబ్బు ఇవ్వకపోవడంతో అనీ మాస్టర్ సీరియస్ అవుతుంది. పిచ్చోళ్ళలాగా పనిచేశాం. కుక్కల్లాగా వర్క్ చేయించుకున్నారు.. కనై డబ్బులు ఇవ్వరు అంటూ మనస్తాపానికి గురవుతుంది. దీనితో హోటల్ స్టాప్ మొత్తం ధర్నాకు దిగాలని డిసైడ్ అవుతారు. 10వేలు డబ్బు ఇచ్చే వరకు కస్టమర్లకు ఎలాంటి సేవలు చేయకూడదని..కనీసం ఫుడ్ కూడా వండకూడదని డిసైడ్ అవుతారు. 

ధర్నాలో భాగంగా వంట గదిలో ఉన్న సామాన్లు మొత్తం వేరే గదిలో పెట్టేస్తారు. అడిగినంత డబ్బు ఇచ్చేవరకు ఎలాంటి సేవలు చేసేది లేదని తేల్చి చెప్పేస్తారు. ఇలా నేటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇక రేపటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరగబోతోంది.  Also Read: తన పెళ్లిపై కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

click me!