Cocktail Party: అయ్యప్ప స్వామి దీక్ష ఎంత నిష్టగా చేయాలో అందరికీ తెలిసిందే. అయితే.. అలాంటి దీక్ష చేపట్టిన రామ్ చరణ్ మాత్రం పార్టీలకు వెళ్లారంటూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ తమ్ముడు అల్లూ శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ఆయనకు ఎంగేజ్మెంట్ గా.. మార్చి నెలలో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి నేపథ్యంలో.. అల్లూ అర్జున్ తన సోదరుడు అల్లూ శిరీష్, అతనికి కాబోయే భార్య నైనికా రెడ్డి కోసం ఓ కాక్ టెయిల్ పార్టీ ఏర్పాటు చేశారు. కాక్ టెయిల్ పార్టీ అంటే.. మందు, మద్యం ఉంటాయి అని అందరికీ తెలిసిందే. దీంతో.. అలాంటి ప్రదేశానికి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరు కావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
23
అల్లూ శిరీష్ కాక్ టెయిల్ పార్టీ...
ఈ కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఒక వీడియోలో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన తో కలిసి కనిపించారు. చరణ్ అయ్యప్ప మాల ధరించి ఉండటం వీడియోలో క్లియర్ గా కనపడుతుంది. దీంతో.. ఈ విషయంపై అనుమానాలు వచ్చాయి. అలాంటి పార్టీకి అయ్యప్ప మాల ధరించిన వాళ్లు వెళతారా అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చరణ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కామెంట్స్ వర్షం కురిపించారు.
33
ట్రోలింగ్ పై క్లారిటీ..
ఈ కామెంట్స్ పై తాజాగా అల్లు శిరీష్ స్పందించారు. ఆ ట్రోలర్స్ నోరు మూయించేలా సమాధానం చెప్పారు.‘ పార్టీలో మేమంతా మందు ముట్టుకోవడానికి ముందే స్వామి వచ్చి, మాకు శుభాకాంక్షలు చెప్పి.. తర్వాత వెంటనే వెళ్లిపోయారు’ అంటూ అల్లూ శిరీష్ చెప్పారు. శిరీష్ ఇచ్చిన క్లారిటీతో కాంట్రవర్సీకి పులిస్టాప్ పడింది.
అయ్యప్ప దీక్ష పట్ల రామ్ చరణ్ నిబద్ధత..
రామ్ చరణ్ కి అయ్యప్ప దీక్ష పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఆయన ఈ దీక్ష చేపడుతూనే ఉన్నారు. చాలా నిష్టతో 41 రోజుల దీక్ష చేసి.. ఆ తర్వాత.. శబరిమల దర్శిస్తూ ఉంటారు.