ఈ క్రమంలో 2003లో ఆయన `గంగోత్రి` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించగా, అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ బాగానే ఆడింది. కానీ అనుకున్నంత గొప్పవిజయం సాధించలేకపోయింది.
ఆ తర్వాత `ఆర్య` చిత్రంతో బ్రేక్ అందుకున్నారు బన్నీ. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `వేదం`, `రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు`, `డీజే`, `అల వైకుంఠపురములో`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతో హీరో నుంచి స్టార్ హీరోగా, పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు.