
`పుష్ప 2`తో అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు. ఆయన మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. ప్రభాస్ తర్వాత బిగ్గెస్ట్ స్టార్గా రాణిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ని దాటి నెంబర్ 1 స్టార్గా ఎదిగే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా అట్లీతో సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు పారితోషికం విషయంలోనూ నయా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు బన్నీ.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న `ఏఏ22` సినిమాను సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ కోసం అట్లీ, అల్లు అర్జున్ ఇటీవల అమెరికా వెళ్లడం విశేషం. ఇది సైన్స్ ఫిక్షన్ (Sci-fi) జానర్ సినిమాగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే సమ్మర్కి మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీకి పారితోషికం విషయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు అల్లు అర్జున్. షేరింగ్ సిస్టమ్ని ముందుకు తీసుకొస్తున్నారట. బిజినెస్లో వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమాకి కేవలం ఒకేసారి రెమ్యూనరేషన్ తీసుకోవడం కాకుండా, లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారట.
ప్రాథమిక పారితోషికం
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సుమారు ₹175 కోట్లు అడ్వాన్స్గా తీసుకుంటున్నారని సమాచారం.
లాభాల్లో వాటా
ఇది కాకుండా, సినిమా మొత్తం ఆదాయంలో 27% నుంచి 30% వరకు వాటా (Share) అడిగినట్టు తెలుస్తోంది.
మొత్తం ఆదాయం
సినిమా బిజినెస్, వసూళ్లు ₹1000 కోట్లు దాటితే, అల్లు అర్జున్ మొత్తం ఆదాయం ₹300 కోట్లు దాటే అవకాశం ఉంది. దీనితో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే ఇలాంటి పెద్ద లాభాల వాటా పద్ధతిని పాటించారు.
'జవాన్' సినిమా ₹1000 కోట్ల వసూళ్ల తర్వాత, అట్లీ మార్కెట్ అమాంతం పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమా కోసం అట్లీకి ₹100 కోట్ల పారితోషికం మాట్లాడుకున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్, ఎమోషన్తో కూడిన అట్లీ ట్రేడ్మార్క్ స్టైల్ ఉంటుందనడంలో సందేహం లేదు. సూపర్ హీరో ఎలిమెంట్లు వేరే లెవల్లో ఉంటాయని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు చూసేలా సినిమాని తీర్చిదిద్దుతున్నారట. ముఖ్యంగా అంతర్జాతీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఇక అల్లు అర్జున్ తన ఇమేజ్ని, క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్ని పెంచుకునేందుకు మరో ప్లాన్ చేస్తున్నారు. అభిమాన సంఘాలను విస్తరిస్తున్నారు. వాటి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. అల్లు అర్జున్ అభిమాన అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో ఆదివారం హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 4–5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ప్రారంభించారు. ఇది బన్నీ ప్లాన్లో భాగంగానే జరుగుతుందని సమాచారం.