Janaki Kalaganaledu: అఖిల్, జానకిలపై అనుమానం పెంచుకున్న మల్లిక.. జెస్సితో ఉన్న ఫోటోలు డిలీట్ చేసిన అఖిల్!

First Published Sep 2, 2022, 11:35 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అఖిల్ ఆనందంగా  కేరంస్ ఆడడం చూసి జానికి కోపంతో అక్కడికి వస్తుంది. అప్పుడు మల్లికా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అసలు ఏమవుతుంది జానకి ఎందుకు అఖిల్ వైపు అంత కోపంగా చూస్తుంది తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత అఖిల్ పరధ్యానం లో కేరంస్ ముక్కల్ని తప్పుగా కొట్టడం లాంటివి చేస్తాడు.అప్పుడు రామ తాను ఓడిపోయి అఖిల్ ని గెలిపిస్తాడు అప్పుడు జ్ఞానాంబ, రామ ఆటలోనే కాదు జీవితంలో కూడా తను ఓడిపోయే అఖిల్ నీ ఎప్పుడు గెలిపిస్తూ ఉంటాడు.
 

అఖిల్ కోసం తన చదువును త్యాగం చేశాడు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో రామా జానకి కోసం గాజులు తెస్తాడు.మీకోసం గాజులు తెచ్చారు జానకిగారు అని చెప్పి జానకిని కూర్చోబెట్టి గాజులు ఇస్తాడు, జానకి ఎంతో మురిసిపోతుంది. మరోవైపు అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రామా ఏమైంది జానకి గారు అలాగున్నారు అని అడగగా ఏమీ లేదు రామ గారు రేపు పరీక్ష గురించి ఆలోచిస్తున్నాను అని అంటాది. పక్కనుంచి ఇదంతా వింటున్న మల్లిక బావ గారు జానకికి మట్టి గాజులే ఇచ్చారు.
 

 నేను మా ఆయన చేత బంగారు గాజులు కొనిపించుకోవాలి అని చెప్పి పడుకున్న విష్ణుని లేపి నాకు బంగారం గాజులు కావాలి అని అడుగుతుంది. ఎందుకమ్మా ఈ సమయంలో అలాంటి కోరికలు గుర్తొస్తున్నాయి అని విష్ణు అనగా బావగారు జానకి మట్టికాజులు కొన్నారు అని అంటుంది. అయితే ఇవి కడుపుతో ఉన్నప్పుడు వచ్చే ఆశలు కాదన్నమాట మీతోటి కోడలు మీద కుల్లుతో తో వచ్చే ఆశలు అనమాట అని అనగా మీ కోసం వారసుడిని ఇస్తున్నాను కదా నాకోసం కనీసం గాజులు ఇవ్వలేరా అని అంటుంది మల్లికా.
 

అప్పుడు విష్ణు, సరే కడుపుతో ఉన్నావు కాబట్టి నా నుంచి నీకు గాజులు బహుమతిగా ఇస్తాను లే అని అంటాడు.దానికి మల్లికా ఎంతో సంతోషపడి ఇప్పుడు మీరు పడుకోండి అని చెప్పి కాలు పడుతుంది. ఆ తర్వాత సీన్లో జెస్సి జానకి కు ఫోన్ చేసి అక్క నేను నీకు చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా అని అడగగా ఇది ఇంత తొందరగా తేలిపోయే విషయం కాదు జెస్సి, మీరు తొందరపడి చేసిన తప్పు కి అర్థవంతమైన జీవితం ఇవ్వాలంటే సమయం పడుతుంది అని అంటాది. పక్క నుంచి మాటలన్నీ వింటున్న అఖిల్ జెస్సీ వదినకి అంత చెప్పేసినట్టు ఉంది అని అనుకుంటాడు.
 

అప్పుడు జానకి నీకు ఫొటోస్ పంపమన్నాను కదా అవి పంపావా? ఇంకో విషయం ఈ ఫొటోస్ ఇంకా ఎవరికీ పంపొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది .అప్పుడు అఖిల్ అయితే ఫొటోస్ వదిన దగ్గర ఉన్నాయన్నమాట, ఎలాగైనా ఫొటోస్ డిలీట్ చేయాలి అని చెప్పి జానకి రామా పడుకున్న సమయం లో వెళ్లి జానకి ఫోన్లో ఫొటోస్ డిలీట్ చేస్తాడు. డిలీట్ చేసి బయటికి వచ్చే సమయానికి జ్ఞానాంబ నీళ్లు తాగుతూ ఉంటుంది.ఇక్కడ ఏం చేస్తున్నావ్ అఖిల్ అని అడగగా చదువుకుంటున్నాను అమ్మ రాత్రిపూట చదివితే ప్రశాంతం గా  ఉంటుంది అని అంటాడు.
 

 అప్పుడు జ్ఞానంబ ఉదయం అంతా గోలగా ఉంటుందని ప్రశాంతంగా ఇప్పుడు చదువుకుంటున్నావా నేను వెళ్లి టీ పెడతాను ఆగు,నువ్వు ఇలాగే పట్టుదల తో ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలవు. నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది అని అంటాది. అమ్మ నా మీద ఇంత ఆశలు పెట్టుకున్నాది ఇప్పుడు నా  ప్రేమ వ్యవహారం గురించి  తెలిసి,జెస్సీ ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడతాడు.ఆ తర్వాత జానకి తన నిద్రలో కళ్ళు తెరిచి అలాగా ఫోన్ వైపు చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!