300 కోట్ల కలెక్షన్స్ తో స్టార్ డమ్ సంపాదించింది హీరోయిన్, సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ అయ్యింది. తమిళంలో సెటిల్ అయిన తెలుగు స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా?
ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసిన హీరోయిన్, తెలుగు హీరోయిన్ అయినా టాలీవుడ్ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు 300 కోట్ల కలెక్షన్స్ సాధించగల హీరోయిన్ అయ్యింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో అదరగొడుతోంది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ బ్యూటీ ఎవరు?
ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఈ హీరోయిన్ కు 2025 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం మొదటి 2 నెలల్లోనే 2 మెగా హిట్లు కొట్టింది ఐశ్వర్య రాజేష్. టీవీ యాంకర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
మణికందన్ దర్శకత్వం వహించిన కాకా ముట్టై సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఐశ్వర్య. కాకా ముట్టై హిట్ తర్వాత తమిలంలో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఆ విధంగా ధనుష్తో వడ చెన్నై, విజయ్ సేతుపతితో పన్నయారుం పద్మినియుం, ధర్మదురై, విక్రమ్తో సామి 2 వంటి సినిమాల్లో నటించింది. నయనతార తర్వాత హీరోయిన్గా లేడీ ఓరియోంటెడ్ మూవీస్ చేసిన సౌత్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ను అభిమానులు లేడీ సూపర్స్టార్ అని పిలుచుకుంటున్నారు.
అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా.. తమిళంలో ఎక్కువగా నటిస్తూ వచ్చింది ఐశ్వర్య రాజేష్. ఆమె తండ్రి రాజేష్ తెలుగులో హీరో, ఐశ్వర్య మేనత్త ప్రముఖ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి. ఇక మొదట్లో తెలుగులో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. మనవాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది ఐశ్వర్యకు డిమాండ్ పెరిగింది.
ఐశ్వర్య రాజేష్కు ఈ సంవత్సరం తెలుగులో కూడా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది పొంగల్ కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా నటించింది ఐశ్వర్య. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత ఫిబ్రవరిలో ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ నటించిన సుజల్ వెబ్ సిరీస్ రెండో సీజన్ విడుదలైంది. దీని మొదటి సీజన్ పెద్ద హిట్ అవ్వడంతో, ఇప్పుడు విడుదలైన రెండో సీజన్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఓటీటీలో నంబర్ 1 వెబ్ సిరీస్గా ట్రెండ్ అవుతోంది. ఇలా 2025లో రెండే నెలల్లో థియేటర్, ఓటీటీలో బంపర్ హిట్ కొట్టడంతో ఐశ్వర్య రాజేష్. అంతే కాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట ఐశ్వర్య రాజేష్.