Devatha: ఆదిత్య ముందే రాధ తన భార్య అని చెప్పుకున్న మాధవ్.. దేవి గురించి దేవుడమ్మ ఆలోచన!

First Published Jul 1, 2022, 11:22 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 1వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో రాధ(radha) చిన్న ఈ స్పీచ్ ఇచ్చిన తరువాత ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆదిత్య మాట్లాడుతూ పిల్లలను పిల్లలను ఇంత ప్రయోజకురాలుగా  చేస్తున్న రాధ గారిని కూడా ఒకసారి వేదికపైకి రావాలి అని కోరడంతో రాధ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రాధ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వేదికపైకి వెళ్లగా వారితో పాటు మాధవ(madhava) కూడా వెళ్తాడు.
 

అప్పుడు ఆదిత్య(adithya)పిల్లలకు బహుమతులు అందించిన తరువాత మాధవ ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నా పిల్లలు ఇద్దరు ఇలా ఉండటానికి కారణం నా భార్య రాధ అనడంతో రాధ ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ఆదిత్య ఇంటికి వెళ్లి స్కూల్లో దేవి మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా ఉంటాడు. దేవి(devi)  మాట్లాడిన మాటలు గురించి ఇంట్లో వారికి చెప్పడంతో ఇంట్లో వారందరూ సంతోష పడుతూ ఉంటారు.
 

అప్పుడు దేవుడమ్మ (devudamma)ఎందుకు దేవి గురించి అంతగా తాపత్రయపడుతున్నావు ఒక కన్న తండ్రి కంటే ఎక్కువగా సంతోషపడుతున్నావు అని అంటుంది. దేవి తండ్రి మాధవ(madhava)ఉన్నాడు కదా నువ్వు అంతలా ప్రేమ పెంచుకోవద్దు అని దేవుడమ్మ అనగా వెంటనే సత్య అంత ప్రేమ మన బిడ్డ కోసం దాచి పెట్టు త్వరలోనే అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందాము అని అంటుంది

ఆ తర్వాత ఆదిత్య (adithya)అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇంట్లో అందరూ ఎందుకు ఆదిత్య దేవిపై అంత ప్రేమను చూపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. మరొకవైపు మాధవ రామ్మూర్తి దంపతులతో మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందని ఇకపై రాధ(radha)ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లదు చిన్మయి ని కూడా దూరం చేసుకోదు అని అనడంతో వారిద్దరు సంతోషపడుతూ ఉంటారు.
 

 ఆ తర్వాత రామ్మూర్తి తాను ఈ ఇంటి కోడలు కాకుండా ఈ ఇంటి మహాలక్ష్మి అని అంటాడు. ఆ తరువాత మాధవ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాధ(radha)అక్కడికి వచ్చి తనకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది. ఆదిత్య లాగే దేవి (devi)కూడా కలెక్టర్ అవుతుంది అని మురిసిపోతూ ఉంటుంది రాధ. అప్పుడు చిన్మయికి కూడా నేను దూరంగా ఉన్నా కూడా తల్లిగా అందించే బాధ్యతలు అందిస్తాను అనడంతో మాధవ షాక్ అవుతాడు.
 

మరోవైపు కమల(kamala) భాష మాట్లాడుకుంటూ ఉండగా.. అప్పుడు భాష ఆదిత్యాలో మార్పు వచ్చింది అనగా అప్పుడు వెంటనే కమల అమ్మని దేవి ఎందుకు అమ్మమ్మ అని పిలుస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు రాధ (radha)పిల్లలు మాట్లాడే మాటలు తలుచుకొని సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది.
 

 ఇంతలో దేవి(devi) మాట్లాడినప్పుడు ఆఫీసర్ చాలు చాలా సంతోష పడ్డారు అని అనగా వెంటనే రాధ(radha) కన్న కూతురు మాట్లాడితే కన్నతండ్రి కి అంత సంతోషంగా ఉండదా అనడంతో పిల్లలిద్దరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏవో ఒక మాటలో చెప్పి ఆ మాటను జవదాటేస్తుంది రాధ.

click me!