Guppedantha Manasu: దేవయాని, సాక్షి కుట్ర.. వసు అభినందన సభలో రిషీకి అవమానం!

First Published Jul 1, 2022, 9:35 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో జగతి(jagathi), వసు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వసు, రిషీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నీ ఆలోచనలు  నీ మనసు ఏంటో నీకే తెలియాలి అని అనగా అప్పుడు వసు(vasu)ఈ మధ్యనే నాకు ఒక క్లారిటీ వచ్చింది మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషీ ఒకచోట కారులో కూర్చొని వసు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
 

మరొకవైపు అభినందన సభ దగ్గర జగతి వాళ్ళందరూ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ వసు(vasu)మాత్రం రిషి కోసం ఎదురుచూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బస్తీ వాళ్ళు రావడంతో వాళ్ళని ఆనందంతో రిసీవ్ చేసుకుంటుంది వసుధార. ఆ తరువాత వసు,రిషీ గురించి ఆలోచిస్తూ రిషి(rishi)కి మెసేజ్ చేస్తుంది. అప్పుడు వసు మెసేజ్ కి రిషీ కోపంతో రగిలిపోతు ఉండగా ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో కోపంతో కసురుకుంటాడు.
 

ఇంతలోనే అక్కడికి దేవయాని(devyani),సాక్షి, ధరణి వస్తారు. అప్పుడు దేవయాని మహేంద్ర దంపతులతో కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు జగతి,(jagathi) దేవయానికి స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. ఆ తర్వాత సాక్షి అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ తో మాట్లాడుతూ ఉండగా జగతికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత సాక్షి దేవయాని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు జగతికి అనుమానం వస్తుంది. ఇంతలోనే అక్కడికి మినిస్టర్ రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు.
 

అప్పుడు సాక్షి(sakshi)ఈ ఆనందం మరికొద్ది సేపే నీకు ఘోరంగా అవమానం జరగబోతోంది అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి,వసు కి కంగ్రాట్స్ చెప్పు కాస్త అనుమానం వచ్చే విధంగా మాట్లాడడంతో వసు(vasu)కి సాక్షి మాటల మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవుతుంది. అప్పుడు రిషీ రాకపోవడంతో గౌతమ్,వసు,జగతి ముగ్గురు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తరవాత జగతి దగ్గరికి సాక్షి, దేవయాని అక్కడికి వెళ్లి జగతికి వారి మాట్లాడితే లేనిపోని టెన్షన్ పెడతారు.
 

ఆ తరువాత వసు( vasu) కి సంబంధించిన వీడియోని చూపించడంతో ఆ వీడియోని చూస్తూ జగతి షాక్ అవుతుంది. మరొకవైపు వసు రిషీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తరువాత సాక్షి ( sakshi)మినిస్టర్ కి చెప్పి ఆ వీడియోని ప్లే చేయిస్తుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. రిషీ రాయడంతో అందరూ అక్కడ ఒకసారిగా సంతోషపడతారు. అప్పుడు దేవయాని సాక్షి ఇద్దరూ ఆనందపడుతూ ఉంటారు. ఆ తరువాత వసు కి సంబంధించిన వీడియో ప్లే కావడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. అప్పుడు రిషీ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా వసుధారపై సీరియస్ అవుతాడు.

click me!