వేరు కాపురంపెట్టబోతున్న ఐశ్వర్య రాయ్, 6 ప్లాట్లు కొన్న అభిషేక్ బచ్చన్.. ఎన్ని కోట్లు పెట్టారంటే..?

First Published Jun 20, 2024, 11:17 AM IST

ఐశ్వర్యరాయ్ వేరు కాపురంపెట్టబోతోందా..? అభిషేక్ తో కలిసి.. అమితాబ్ ఇంటి నుంచి బయటకు రాబోతోందా..? బచ్చన్ ఫ్యామిలీలో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా..? ముంబయ్ లో కోన్న 6 ప్లాట్లకు ఎన్ని కోట్ల పెట్టారు..? 
 

Aishwarya Rai Bachchan

అమితాబచ్చన్ నటవారసత్వాన్ని తీసుకుని.. సొంతంగా ఎదగలేకపోయాడు అభిషేక్ బచ్చన్. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్ ను పెళ్ళాడాడు. వారికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. ఇక ఇప్పటి వరకూ బచ్చన్ ఫ్యామిలీ కలిసి ఉమ్మడిగానే జీవిస్తున్నారు. కాని తాజాగా వారు ఐశ్వర్య రాయ్ వేరు కాపురం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

ఈ పరిస్థితిలో నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివలి ప్రాంతంలో 15.42 కోట్లతో 6 ఫ్లాట్లను కొనుగోలు చేశారట. మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్‌మెంట్లుమొత్తం రేటు  31,498 గా తెలుస్తోంది. ఈ క్రమంలో రిజిస్టేషన్ కు సంబంధించిన ప్రక్రియ మే 5, 2024న  పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ ఆరు అపార్ట్‌మెంట్‌లు బోరివలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (WEH)లో ఎత్తైన భవనం యొక్క 57వ అంతస్తులో ఉన్నాయి మరియు 10 కార్ పార్కింగ్ స్థలాలను కూడా కలిగి ఉన్నాయి.

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

Latest Videos


ఈ ఏడాది ప్రారంభంలో అభిషేక్ బచ్చన్ తండ్రి, నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 10 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ మరియు అనుష్క శర్మ వంటి ప్రముఖులు కూడా అలీబాగ్‌లో ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఈ జాబితాలో చేరాడు.ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో అమితాబ్ అయోధ్యలో 14.5 కోట్లకు భూమి కొన్నట్లు వార్తలు వచ్చాయి. 14.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 

త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ఆయన అయోధ్యలో భూమిని కొనుగోలు చేశారు. అంతే కాదు గత సంవత్సరం, అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా నందాకు సబర్బన్ జుహులోని తన బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు. 'ప్రతీక్ష' బంగ్లా విలువ 50.63 కోట్లు. ఈ బంగ్లాను తొలిసారిగా కొనుగోలు చేసింది అమితాబ్ కావడం గమనార్హం

లెజెండరీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇండయన్ మెగాస్టార్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. దాదాపు  50 ఏళ్లకు పైగా ఆయన నటజీవితం కొనసాగుతుంది. ఇప్పటికి  హీరోగా కెరీర్‌లో 200కి పైగా సినిమాల్లో నటించారు అమితాబ్.. బిగ్ బిగా పేరుగాంచిన అమితాబ్ తన నటనా నైపుణ్యంతో పాటు జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు. అమితాబ్ నటుడిగానే కాకుండా, సినీ నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా మరియు టీవీ షో హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి. 

సినిమాలు, టీవీ షోలు, ప్రకటనల ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా స్థిరాస్తి, వివిధ పెట్టుబడుల ద్వారా అమితాబ్ కు భారీగా సంపాదన ఉంది.  దేశంలోని అత్యంత సంపన్న నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ  3100 కోట్లు  ఉంటుందని అంచనా.  అమితాబ్ ముంబైలో విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు మరియు వ్యక్తిగత జీవితంతో రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నారు.

Amitabh Bachchan Family

ఇంతలో అమితాబ్ తన తోటి నటి జయా బచ్చన్‌ని పెళ్లాడాడు. జయా బచ్చన్ మరియు అమితాబ్ బచ్చన్ ఇద్దరు పిల్లలు శ్వేతా బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్.అభిషేక్ బచ్చన్ నటి మరియు మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు మరియు ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. .

click me!