₹5 కోట్ల బడ్జెట్తో రూపొందిన గీత గోవిందం సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹132 కోట్లు వసూలు చేసి, 2018లో నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ తర్వాతి స్థానంలో ఉంది.
బన్నీ వాస్ ఈ సినిమాను GA2 Pictures పతాకంపై నిర్మించగా, గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలైంది. గీతా కనుగంటి, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, నాగేంద్రబాబు, సుహాసిని మణిరత్నం, అన్నపూర్ణ, గిరిబాబు తదితరులు నటించారు.
ఏడేళ్లైనప్పటికీ, ఈ సినిమా పరశురామ్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజయ్–రష్మికల జోడీ, గోపీ సుందర్ సంగీతం, పరశురామ్ కథనశైలి ఇవన్నీ గీత గోవిందంను ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా మార్చాయి. ఇప్పుడు విజయ్–రష్మిక జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి కూడా ఈ చిత్రం కూడా ఓ కారణంగా ఉందని చెప్పవచ్చు. అక్కడి నుంచే వీరి పరిచయం మొదలైంది మరి !