2020-21 లో భారత జట్టు ఆస్ట్రేలియాకు పర్యటించినప్పుడు అప్పుడే అరంగ్రేటం చేసిన సిరాజ్.. ఆ సిరీస్ లో భారత్ తరఫున అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లీష్ బ్యాటర్లను వణికించాడు. లార్డ్స్ తో పాటు ఆ సిరీస్ లో భారత్ ఆధిక్యం సాధించడంలో కూడా బౌలింగ్ విభాగంలో సిరాజ్ ముఖ్య భూమిక పోషించాడు.