తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా.. 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రోహిత్ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14) లు విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (48) ఆదుకున్నా అతడు కూడా నిష్క్రమించాడు. ప్రస్తుతం రహానే (29 నాటౌట్), భరత్ (5 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.