భారత జట్టులో 2021లో జరిగిన మార్పులు పెనుదుమారమే రేపాయి. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీని.. బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. ఈ క్రమంలో నాటి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఇద్దరూ మీడియాముఖంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.