డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో అశ్విన్ ను తప్పించడం దారుణమని అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్ కు విరాట్ సారథిగా లేకపోవడం నిరుత్సాహం కలిగించిందని, కోహ్లీ కెప్టెన్సీలోని దూకుడు ఇప్పుడు లేదని పేర్కొన్నాడు. అశ్విన్ ను తప్పించడం దారుణమన్న హర్షవర్ధన్.. బుమ్రా దూరం కావడం కూడా భారీ నష్టాన్ని కలిగించిందని ట్వీట్ చేశాడు.