అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో స్టార్లు లేకుండానే పలు ఫ్రాంచైజీలు ఆడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో టీమిండియాకు చెందిన కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి కీలక ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా దిగ్గజం, 2011లో వన్డే వరల్డ్ కప్ విజేత గౌతం గంభీర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.