Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నుందా?

Published : Mar 08, 2025, 05:19 PM ISTUpdated : Mar 08, 2025, 07:19 PM IST

Champions Trophy 2025 IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో ఇండియా vs న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. దుబాయ్ లో ఆదివారం జ‌రిగే ఈ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నందా? ఆ రోజు వాతావ‌ర‌ణం ఎలా వుండ‌నుంది?   

PREV
12
Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నుందా?
Indian Team

Champions Trophy 2025 IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆదివారం వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న భారత జ‌ట్టును ప్రమాదకరమైన న్యూజిలాండ్ ఢీ కొట్ట‌నుంది. ఈ ఐసీసీ బిగ్ ఫైట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ దాదాపు ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త ఛాంపియ‌న్ ఎవ‌రో తేల‌నుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి మూడో టైటిల్ గెలవలేకపోయింది. 12 సంవత్సరాల తర్వాత, భారతదేశం మరోసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకునే అవకాశం ఉంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డుకానుందా? 

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందా లేదా అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిజానికి, ఈ ఫైనల్ మ్యాచ్ సమయంలో ఆదివారం వర్షం పడే అవకాశం చాలా తక్కువ. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా. రోజు గడిచేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, మధ్యాహ్నం 3 గంటల నుండి దుబాయ్‌లో కొంత మేఘావృతం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ (82.4 డిగ్రీల ఫారెన్‌హీట్)కి తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు తక్కువని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, ప్ర‌కృతిలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌నే విష‌యాన్ని కూడా మ‌నం గుర్తుపెట్టుకోవాలి.

22
Dubai International Cricket Stadium

వర్షం కారణంగా IND vs NZ ఫైనల్ ర‌ద్దైతే ఏమ‌వుతుంది? 

మార్చి 9న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం తక్కువ. దుబాయ్‌లో వాతావరణం సాధార‌ణంగా ఉంటుంద‌ని స‌మాచారం. పగటిపూట 48 శాతం మేఘావృతం ఉంటుందని, వర్షం పడే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుందని అంచనా. మార్చి 9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సమయంలో వర్షం పడితే, టోర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వ్ డే (మార్చి 10, సోమవారం) ఉంటుంది.

రిజ‌ర్వ్ డే రోజు కూడా వ‌ర్షం ప‌డితే? 

మార్చి 9న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, దానిని రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. వర్షం కారణంగా రిజ‌ర్వు డే రోజకూడా మ్యాచ్ కొన‌సాగ‌క‌పోతే ర‌ద్దు చేస్తారు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే ట్రోఫీని  భారత్ - న్యూజిలాండ్ లు పంచుకుంటాయి.  గ‌తంలో కూడా ఇలా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ 2002లో ర‌ద్దు అయింది. ఈ ఫైన‌ల్ లో  ఇండియా, శ్రీలంక‌లు త‌ల‌ప‌డ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ పూర్తికాలేదు. దీంతో రెండు జ‌ట్ల‌ను ఛాంపియ‌న్ గా ప్ర‌క‌టించారు. ఇరు జ‌ట్లు ట్రోఫీని పంచుకున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories