ఛాంపియన్స్ ట్రోఫీ 2025: మార్చి 9న వర్షం పడితే ఫైనల్ పరిస్థితి ఏంటి?
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్లో వర్షం పడే అవకాశం లేదు. కానీ వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు. ఎందుకంటే మనం ప్రకృతిని కంట్రోల్ చేయలేం. ఒకవేళ ఈ మ్యాచ్లో వర్షం పడితే, రిజర్వ్ డే (మార్చి 10) కేటాయించారు. కాబట్టి మార్చి 9న ఫలితం తేలకపోతే, మరుసటి రోజు మ్యాచ్ జరుగుతుంది.
ఒకవేళ రెండో రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. సెమీఫైనల్లో ఉన్న రూల్స్ ఇందులో వర్తిస్తాయా అని మీరు ఆలోచించవచ్చు. అంటే మ్యాచ్ రద్దు చేస్తే, ఎక్కువ పాయింట్లు పొందిన జట్టు ఫైనల్కు వెళ్తుంది. అలాగే, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇప్పటివరకు ఎక్కువ పాయింట్లు పొందిన టీమ్ ట్రోఫీని అందుకుంటుందని మీరు అనుకోవచ్చు, కానీ, ఐసీసీ రూల్స్ లో అలాంటిదేమీ లేదు.