గంగూలీ, షా లు 2019 అక్టోబర్ నుంచి వాళ్ల పదవుల్లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వచ్చిన తర్వాత 2020, 2021 లో ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహించడంతో పాటు కొద్దిరోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ మీడియాహక్కుల వేలంతో బోర్డుకు భారీ ఆదాయాన్ని అందించడంలో జై షా కీలకంగా వ్యవహరించారని బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో తదుపరి అధ్యక్షుడిగా గంగూలీని కాకుండా జై షాను ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయంతో బోర్డు సభ్యులున్నట్టు తెలుస్తున్నది.