తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 19వ ఓవర్ వేసే బాధ్యతలను యంగ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కి అప్పగించాడు రోహిత్ శర్మ. అప్పటికే హర్షల్ పటేల్, దీపక్ చాహార్ కోటా ముగియడంతో 19వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్... ఏకంగా 26 పరుగులు సమర్పించాడు. నో బాల్తో మొదలెట్టి ఓ వైడ్తో 6,4,4,2,6 ఇచ్చి 4 ఓవర్లలో 62 పరుగులు అప్పగించాడు...