ఐసీసీ టోర్నీల్లో అద్బుతంగా ఆడే శిఖర్ ధావన్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు, రెండు వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. వీటిల్లో 6 సెంచరీలతో 65.15 సగటుతో 1238 పరుగులు చేసి, ‘మిస్టర్ ఐసీసీ టోర్నీస్’గా పేరు దక్కించుకున్నాడు శిఖర్ ధావన్. శుబ్మన్ గిల్ కారణంగా శిఖర్ ధావన్ వన్డే టీమ్లో కూడా చోటు కోల్పోయాడు.