ఇంగ్లాండ్ ను టీ20లలో 1-2తో మట్టికరిపించిన ఇండియా.. వన్డేసిరీస్ లో కూడా శుభారంభమే చేసింది. ది ఓవల్ లో జరిగిన తొలి వన్డే లో భారత జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణ లు చెలరేగడంతో ఇంగ్లాండ్ కు భంగపాటు తప్పలేదు.