టీ20ల వల్ల విండీస్ ఆటగాళ్లలో చాలా మార్పులు వచ్చాయి. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, డారెన్ సామి, సామ్యూల్స్ వంటి సీనియర్లతో పాటు షిమ్రాన్ హెట్మెయర్, రొవ్మన్ పావెల్, మెక్కాయ్, నికోలస్ పూరన్ వంటి స్టార్లు కూడా పొట్టి క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ లలో అదరగొట్టే క్రికెటర్లు ఉన్నా జాతీయ జట్టుకు ఆడేందుకు టీమ్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆ దేశపు క్రికెట్ బోర్డుది. క్రికెటర్లు, బోర్డు మధ్య పొరపొచ్చాలు రావడం.. మాజీ కోచ్ తో విభేదాల కారణంగా ఆ జట్టు నానాటికీ దిగజారింది.