మేం ఆడేటప్పుడు పాక్ టీమ్ ఇలా ఉండేది కాదు! వీళ్లంతా పేపర్ ప్లేయర్లు.. - సౌరవ్ గంగూలీ

Chinthakindhi Ramu | Published : Oct 17, 2023 6:11 PM
Google News Follow Us

ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకి, పాకిస్తాన్‌పై తిరుగులేని ఆధిక్యం ఉంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 8-0 తేడాతో అన్ని మ్యాచుల్లో పాక్‌ని చిత్తు చేసిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఒకే ఒక్కసారి పరాజయాన్ని చవి చూసింది...
 

17
మేం ఆడేటప్పుడు పాక్ టీమ్ ఇలా ఉండేది కాదు! వీళ్లంతా పేపర్ ప్లేయర్లు.. - సౌరవ్ గంగూలీ

అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ వన్‌సైడెడ్‌గా సాగి, అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. టీమిండియా బౌలర్ల ముందు పాకిస్తాన్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు...

27

155/2 స్కోరుతో ఉన్న పాకిస్తాన్, 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 86, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో టీమిండియాకి ఘన విజయం దక్కింది.. 

37

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌లో టాప్ 2లో ఉన్న ఇండియా- పాకిస్తాన్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని వేలకు వేలు పెట్టి, స్టేడియానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్... వన్‌సైడ్ మ్యాచ్ చూసి కాస్త నిరాశ చెందారు... ఈ పరాజయంతో పాక్ టీమ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది..

Related Articles

47

‘మేం ఆడేటప్పుడు పాకిస్తాన్ టీమ్ ఇలా ఉండేది కాదు. అది పూర్తిగా డిఫరెంట్ టీమ్. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ ఉండేది. వాళ్ల బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉండేది.. ఇలాంటి పాక్ టీమ్‌తో మేం ఆడేవాళ్లం కాదు...

57

ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్‌ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి బ్యాటింగ్‌తో వరల్డ్ కప్‌‌లో నెట్టుకురావడం చాలా కష్టం..

67

బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఎవరి బ్యాటింగ్‌లోనూ నాకు కసి కనిపించలేదు. టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడినట్టే అనిపించింది.

77
india vs pakistan

మేం చూసిన పాకిస్తాన్ టీమ్ అస్సలు ఇలా ఉండేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos