రెండ్రోజుల క్రితం అడిలైడ్ వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆ జట్టు వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. సందట్లో సడేమియాగా పాకిస్తాన్ మాజీలకు ఇదే అస్త్రంగా మారి.. ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అవాకులు చెవాకులు పేలుతున్నారు.