ధోనీ కొట్టిన ఒక్క సిక్స్‌తో వరల్డ్‌కప్ గెలవలేం... గౌతమ్ గంభీర్ బోల్డ్ కామెంట్స్...

First Published Apr 2, 2021, 6:33 PM IST

2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖరారైపోయింది. విజయానికి 11 బంతుల్లో 4 పరుగులే కావాలి. ఆ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దాంతో వరల్డ్‌కప్ విజయం క్రెడిట్ మొత్తం మాహీకే వెళ్లింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

‘ఒకే ఒక్క సిక్సర్‌తో వరల్డ్‌కప్ సాధించలేం. అలాగే జరిగితే యువరాజ్ సింగ్ ఖాతాలో ఆరు వరల్డ్‌కప్‌లు గెలిచేవాడు. 2011లో వరల్డ్‌కప్ విజయంలో 13, 14 మంది హీరోల పాత్ర ఉంది...
undefined
విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో విజయాన్ని అందించాడు. హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా... పాకిస్తాన్‌పై కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు...
undefined
వరల్డ్‌కప్ జట్టులో ప్రతీ ప్లేయర్ విజయంలో ఎంతో కొంత పాత్ర పోషించినవారే. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఇచ్చిన కాంట్రీబ్యూషన్‌ను ఏ మాత్రం తక్కువ చేయలేం...
undefined
భారత జట్టు ఫైనల్ చేరడంలో వీరూ, సచిన్ ఎంతో కీలక పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్‌తో పాటు జహీర్ ఖాన్ ఇచ్చిన అమూల్యమైన కాంట్రిబ్యూషన్‌... ప్రపంచకప్‌లో ఫైనల్ స్టెప్ దాకా టీమిండియా చేరడానికి సాయపడింది...
undefined
అంతేకానీ మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్‌తో వరల్డ్‌కప్ వచ్చి, టీమిండియా చేతుల్లో పడలేదు’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
undefined
అలాగే మహేంద్ర సింగ్ గురించి తాను తక్కువ చేయడం లేదని, కానీ మొత్తం క్రెడిట్ అతనికే ఇవ్వడం మాత్రం కరెక్టు కాదని చెప్పాడు గౌతమ్ గంభీర్...
undefined
‘2011 వరల్డ్‌కప్ ఫైనల్‌లో నేను ధరించిన జెర్సీని ఇప్పటికీ వాష్ చేయలేదు. దాన్ని అలాగే ఫ్రేమ్ చేసి మా ఇంట్లో గోడకి పెట్టుకున్నాను...
undefined
మహేంద్ర సింగ్ ధోనీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. నిజానికి అతను చాలా సపోర్టివ్. వరల్డ్ కప్ ఫైనల్ రోజు కూడా నేను 97 పరుగుల దగ్గర ఉన్నానని గుర్తు చేసింది మాహీయే...
undefined
నువ్వు 97 పరుగుల వద్ద ఉన్నావు... జాగ్రత్తగా ఆడు సెంచరీ చేసుకో... కావాలంటే నేను స్పీడ్‌గా ఆడతాను’ అంటూ చెప్పాడు గౌతమ్ గంభీర్...
undefined
యువరాజ్ సింగ్ తండ్రి కూడా మహేంద్ర సింగ్ ధోనీపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీ, కావాలనే వరల్డ్‌కప్ ఫైనల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లాడని కామెంట్ చేశాడు యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్...
undefined
అప్పటికే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇన్నింగ్స్‌ల కారణంగా టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. యువరాజ్ నాలుగో స్థానంలో వచ్చి ఉంటే, వరల్డ్‌కప్ క్రెడిట్ మొత్తం అతనికి వెళ్తుందని ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడని వ్యాఖ్యానించాడు యోగ్‌రాజ్.
undefined
click me!