భారత క్రికెట్ జట్టుకు అత్యుత్తమ ఆటగాళ్లను అందించడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) ది కీలక పాత్ర. కర్నాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఎన్సీఎ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి, టీమిండియాకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది. యువ ఆటగాళ్లను సానబెట్టి.. వారిలో అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయడంతో పాటు వారిని దేశవాళీ, అండర్-19 టోర్నీలలో ఆడించి.. అట్నుంచి టీమిండియాకు పంపించడంలో ఇన్నాళ్లు దానికి చీఫ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ కృతకృత్యుడయ్యాడు.