కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో 2018 నాటింగ్హామ్ టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 149 పరుగులు, 51 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
అయితే, కోహ్లి 2021 పర్యటనలో ఇంగ్లండ్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఓవల్, లార్డ్స్లో చిరస్మరణీయ విజయాలతో సిరీస్లోని మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్లలో 2-1 ఆధిక్యంలో భారత్కు ముందుకు సాగింది. అయితే, ఆ సిరీస్లోని చివరి మ్యాచ్ కోవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఆ మ్యాచ్ను పూర్తి చేయడానికి భారతదేశం ఇంగ్లాండ్కు తిరిగి వచ్చే సమయానికి, కోహ్లీ కెప్టెన్గా తప్పుకున్నాడు.