IPL 2020: గెలిచిన తర్వాత కూడా పరుగు కోసం ఉరికాడు...ఈ కోహ్లీకి ఏమైంది...

First Published Oct 22, 2020, 7:46 PM IST

IPL 2020: ఐపీఎల్ గత సీజన్‌లో పరమ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న ఆర్‌సీబీ పరిస్థితి చూసి, విరాట్ కోహ్లీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో సీన్ మారింది.

ఇప్పటిదాకా ఆర్‌సీబీ ఆడిన 10 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
undefined
ఇప్పటిదాకా ఐపిఎల్ టైటిల్ గెలవని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడింది...
undefined
ఈ రెండు జట్లతో తప్ప ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్, రాజస్థాన్ వంటి టైటిల్ గెలిచిన జట్లపై విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
undefined
తాజాగా కేకేఆర్‌ను 84 పరుగులకే పరిమితం చేసి, అందర్నీ అబ్బురపర్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విభాగం...
undefined
85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలోనే చేధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
undefined
అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఓ పని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది...
undefined
40 బంతుల్లో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో... ఏకంగా రెండు పరుగులు పరుగెత్తాడు విరాట్ కోహ్లీ...
undefined
బౌండరీ బాదితే ఎక్స్‌ట్రా పరుగులు జత అవుతాయేమో కానీ, సింగిల్ తీయాల్సిన చోట డబుల్ పరుగెత్తినంత మాత్రాన అవేమీ లెక్కలోకి రావు...
undefined
ఆ విషయం తెలిసి కూడా విరాట్ కోహ్లీ రెండో పరుగు ఎందుకు పరుగెత్తాడనే విషయం అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు అభిమానులు...
undefined
ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేశామనే ఆనందంలో విరాట్ కోహ్లీ కాస్త అత్యుత్యాహానికి గురయ్యాడు అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్...
undefined
click me!