రహానే నిజంగానే అద్భుతం చేశాడు... విజయంపై విరాట్ కోహ్లీ ట్వీట్... రోహిత్, సచిన్ కూడా...

First Published Dec 29, 2020, 11:57 AM IST

బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ... కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లు కూడా ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమిండియా కమ్ బ్యాక్ ఇచ్చిన విధానాన్ని కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు...

‘విరాట్, రోహిత్, ఇషాంత్, షమీ లేకుండా టెస్టు మ్యాచ్ గెలవడం నిజంగా చాలా గొప్ప అఛీవ్‌మెంట్. మొదటి టెస్టు పరాజయం తర్వాత భారత జట్టు తిరిగి వచ్చిన విధానం నాకెంతో నచ్చింది... బ్రిలియెంట్ విన్... వెల్‌ డన్ టీమిండియా...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.
undefined
‘ఇది నిజంగా అద్భుత విజయం.. భారత జట్టంతా కలిసి కట్టు అద్భుతంగా రాణించింది.. బాయ్స్‌ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారత జట్టును జింక్స్ (అజింకా రహానే) అద్భుతంగా నడిపించాడు... ఇక నుంచి ముందుకి, పైకి...’ అంటూ ట్వీట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
undefined
‘అద్భుత భారత్, అమూల్య భారత్... ‘అజింక్యా’ భారత్’ అంటూ రహానే జట్టును నడిపించిన విధానాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
undefined
గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ మధ్యలోనే తప్పుకున్న ఉమేశ్ యాదవ్ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు... ‘ఇదో అద్భుతమైన యూనిట్. ఎత్తు, పల్లాలు వచ్చినా కలిసి కట్టుగా ఉన్నాం. మెల్‌బోర్న్ జట్టు అద్భుతంగా రాణించింది. సిడ్నీ కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు ఉమేశ్.
undefined
‘బాక్సింగ్ డే ఛాలెంజ్ పూర్తి చేశాం... కలిసి కట్టుగా మనం బలంగా ఉన్నాం... ఈ ఏడాదిని విజయంతో ముగించడం చాలా ఆనందంగా ఉంది... వెల్ డన్ టీమ్’ అంటూ ట్వీట్ చేశాడు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
undefined
‘గాయపడిన పులిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు... వెల్ డన్ టీమ్ ఇండియా...’ అంటూ ట్వీట్ చేశాడు భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...
undefined
‘మెల్‌బోర్న్‌లో టీమిండియా ఫెంటాస్టిక్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ మొత్తం క్యారెక్టర్, కంపోజర్ చూపించిన విధానం అద్భుతంగా ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ.
undefined
‘మెల్‌బోర్న్‌లో భారత జట్టు అద్వితీయ విజయాన్ని అందుకుంది. అజింకా రహానే ఇన్నింగ్స్ చాలా కాలం పాటు గుర్తిండిపోతుంది... బౌలర్లు అదరగొట్టారు. ఇప్పుడు, పదండి సిరీస్ గెలిచేయండి...’ అంటూ ట్వీట్ చేశాడు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్.
undefined
‘సూపర్బ్ విక్టరీ టీమిండియా... వాట్ ఏ కమ్ బ్యాక్... కంప్లీట్ టీమ్ పర్ఫామెన్స్... లవ్‌ ఇట్...’ అంటూ ట్వీట్ చేశాడు ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్...
undefined
‘42 పరుగులకే ఆలౌట్ తర్వాతి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓడింది... 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత టీమిండియా విజయాన్ని అందుకుంది... వావ్... ఇది చారిత్రక విజయం... ఎందుకంటే చారిత్రక ఓటమి తర్వాత వచ్చిన విజయం...’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్...
undefined
‘ఈ విజయం ఇచ్చే అనుభూతి 100 శాతం... అందరూ కలిసి కట్టుగా ఈ విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉంది... 2020ను ఇలా ముగించడం చాలా బాగుంది...’ అంటూ ట్వీట్ చేశాడు బుమ్రా...
undefined
‘కమ్ బ్యాక్ ఇవ్వడం ఎప్పుడూ కష్టమే... కానీ టీమిండియా క్లాస్‌తో దాన్ని చేసి చూపించింది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్..
undefined
‘స్పెషల్ టీమ్... స్పెషల్ విన్’ అంటూ ట్వీట్ చేశాడు తాత్కాలిక సారథి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు విన్నర్ అజింకా రహానే...
undefined
click me!