బయోబబుల్ కాలంలో ఆటగాళ్లు ఒత్తిడి బారిన పడటం సహజమని, అయితే వారికి ఈ సమయంలో విరామం చాలా అవసరమని తాను భావిస్తున్నానని రవిశాస్త్రి తెలిపాడు. ఐపీఎల్ తర్వాత ప్రపంచకప్ ఆడటం అనువైంది కాదనీ, కానీ కొవిడ్ కారణంగా రీషెడ్యూలు జరపడంతో అది అనివార్యమైందని అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐని నిందించడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.