అయితే ఆసియా కప్ లో అఫ్గాన్ పై సెంచరీ చేసిన కోహ్లీ తర్వాత బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి తన 72వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ టెస్టులలో మాత్రం కోహ్లీ ఇంకా మునపటి ఫామ్ ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ గేర్ మార్చాలని, మునపటి ఆట ఆడితే బాగుంటుందని పలువురు సూచిస్తున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు. కోహ్లీకి దూకుడుగా ఆడటంతో పాటు ఆటను నియంత్రించడం కూడా వచ్చునని అన్నాడు.